విమానాన్ని ఢీ కొట్టిన పక్షి.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
నాగపూర్, 2 సెప్టెంబర్ (హి.స.) ఇండిగో విమానాన్ని పక్షి ఢీ కొట్టింది దీంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో విమానంలో దాదాపు 270 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు. వారంతా సేఫ్గానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇండిగోకు చెందిన 6E812 విమానం మంగళవారం
విమానం ఎమర్జెన్సీ లాండింగ్


నాగపూర్, 2 సెప్టెంబర్ (హి.స.) ఇండిగో విమానాన్ని పక్షి ఢీ కొట్టింది దీంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో విమానంలో దాదాపు 270 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు. వారంతా సేఫ్గానే ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఇండిగోకు చెందిన 6E812 విమానం మంగళవారం ఉదయం 272 మంది ప్రయాణికులతో నాగ్పూర్ నుంచి కోల్కత్తా బయలుదేరింది. అయితే, విమానం టేకాఫ్ అయిన తర్వాత పక్షి ఢీ కొట్టింది. దీంతో అప్రమత్తమైన పైలట్ ముందు జాగ్రత్తగా విమానాన్ని నాగ్పూర్ ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని నాగ్పూర్ ఎయిర్పోర్ట్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. తనిఖీల అనంతరం మరిన్ని వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande