న్యూఢిల్లీ, 02 సెప్టెంబర్ (హి.స.)అమెరికా విధిస్తున్న సుంకాల (Tariffs)ను ఉద్దేశిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతరుల ఆర్థికస్వార్థం వల్ల ఎన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ భారత్ 7.8 శాతం వృద్ధి రేటును సాధించిందని.. దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలను మించి రాణిస్తోందన్నారు. దిల్లీలోని బశోభూమిలో నిర్వహించిన సెమీకాన్ ఇండియా 2025 సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ పరిస్థితుల్లో అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత్ మాత్రం స్థిరంగా అభివృద్ధి వైపు ముందడుగు వేస్తోందన్నారు. ప్రపంచంలోని వివిధ కంపెనీలు మేకిన్ ఇండియా కోసం భారత్కు రావాలని.. ప్రపంచం కోసం తయారీలు చేపట్టాలని పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వ పాలనలో భారత్లో రాజకీయ స్థిరత్వం, ఆర్థిక స్థిరత్వం, విధానాల్లో పారదర్శకత వంటి పలు మార్పులు చోటుచేసుకున్నాయన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్.. త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని విశ్వాసం వ్యక్తంచేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ