న్యూఢిల్లీ, 2 సెప్టెంబర్ (హి.స.)
లండన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. వినాయక నిమజ్జనానికి వెళ్లి.. తిరిగి వస్తుండగా రెండు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వాసులు నాదరుల్కు చెందిన తర్రె చైతన్య యాదవ్ (23), ఉప్పల్కు చెందిన రిషి తేజ (21) అక్కడిక్కడే చనిపోయారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి గురైన వారందరూ తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే.
చెందారు. ప్రమాదం గురించి సోమవారం రాత్రి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. చైతన్య, రిషి తేజ మృతితో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..