తెలంగాణ, జగిత్యాల. 20 సెప్టెంబర్ (హి.స.)
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియంలో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవంలో భాగంగా శనివారం నిర్వహించిన క్రీడోత్సవాలను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవన విధానంలో ప్రతీ ఒక్కరూ క్రీడలపై దృష్టి పెట్టాలన్నారు.
క్రీడల ద్వారా పని ఒత్తిడిని తగ్గించుకుని మానసికంగా దృడంగా ఉండాలన్నారు. ఆటల్లో గెలుపోటములు సహజమని, ఓడినవారు అనుభవంగా మలుచుకొని విజయం సాధించే దిశగా పట్టుదలతో కృషిచేయాలని అన్నారు. జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు