రేపు మధ్యాహ్నం హస్తినకు సీఎం చంద్రబాబు.. కేంద్ర మంత్రులతో భేటీ!
అమరావతి, 29 సెప్టెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) రేపు మధ్యాహ్నం హస్తినకు వెళ్లనున్నారు. ఈ మేరకు ఆయన విజయవాడ పరిధిలోని గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి మధ్యహ్నం 12.30 గం.లకు బయలుదేరి 1.30 గం.లకు ఢిల్
చంద్ర బాబు


అమరావతి, 29 సెప్టెంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) రేపు మధ్యాహ్నం హస్తినకు వెళ్లనున్నారు. ఈ మేరకు ఆయన విజయవాడ పరిధిలోని గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి మధ్యహ్నం 12.30 గం.లకు బయలుదేరి 1.30 గం.లకు ఢిల్లీ (Delhi)లోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. అనంతరం ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah)తో భేటీ కానున్నారు. ఆ తర్వాత కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమావేశం అయ్యే అవకాశం ఉంది. తిరిగి సాయంత్రం 5 గం.లకు సీఐఐ (CII) సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొని బడా పారిశ్రామికవేత్తల సమక్షంలో పెట్టుబడుపై ప్రసంగించనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande