సిద్దిపేట, 8 సెప్టెంబర్ (హి.స.)
గత మూడు రోజుల నుంచి యూరియా సరఫరా చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని అగ్రహించిన రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో యూరియా కోసం సోమవారం రైతులు ఆందోళన చేపట్టారు. పంటలకు సరిపడా యూరియా అందడం లేదని పలు గ్రామాల రైతులు వాపోయారు. మూడు రోజుల నుంచి యూరియా కోసం వ్యవసాయ పనులు వదులుకొని నిత్యం మండల కేంద్రానికి రావాల్సి వస్తుందని, అయినప్పటికీ యూరియా అందుబాటులో లేకపోవడం వలన తమకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
యూరియా కోసం రైతులు పెద్ద సంఖ్యలో మండల కేంద్రానికి తరలిరావడంతో ఓదశలో తొక్కిసలాట జరిగింది. రైతుల ధర్నా విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని రైతులను సముదాయించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు