
అమరావతి, 17 జనవరి (హి.స.)
అమరావతి: వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఈ నెల 22వ తేదీన ఈడీ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో విస్తృత స్థాయిలో విచారణ చేపట్టిన ఈడీ అధికారులు.. ఇప్పుడు కీలక నేతలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ