
మహబూబ్నగర్, 17 జనవరి (హి.స.) మహబూబ్నగర్ జిల్లాలో
ప్రతిష్టాత్మక త్రిబుల్ ఐటీ భవన నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. మహబూబ్ నగర్ జిల్లా పర్యటనల్లో భాగంగా మొదటగా ఆయన జడ్చర్ల మండల పరిధిలోని చిట్టే బోయినపల్లి గ్రామ శివారులో ఎంపిక చేసిన స్థలంలో దాదాపుగా రూ.600 కోట్లతో నిర్మిస్తున్న భవనానికి భూమి పూజ చేసి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు