
విశాఖపట్నం, 18 జనవరి (హి.స.): ఏపీలో పలు ప్రాంతాల్లో పొగమంచు ఎక్కువగా కురుస్తుండటంపై విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అలర్ట్ జారీ చేసింది. రానున్న మూడు గంటల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో చాలా చోట్ల పొగమంచు ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ