
మేడారం, 18 జనవరి (హి.స.)
తెలంగాణ మంత్రివర్గం తొలిసారి హైదరాబాద్ వెలుపల సమవేశం కాబోతున్నది. ఆదివారం మేడారంలో తెలంగాణ క్యాబినెట్ భేటీ కానున్నది. సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశంలో.. మున్సిపల్ ఎన్నికలు, గోదావరి పుష్కరాల నిర్వహణపై చర్చ జరగనున్నట్లు తెలిసింది. పునర్నిర్మించిన మేడారం ఆలయాన్ని సీఎం ఇవాళ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా అక్కడే మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయించింది. ఇదిలావుంటే ఆలయ ప్రారంభం కోసం ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి వెళ్తుండటంతో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు