
హైదరాబాద్, 19 జనవరి (హి.స.)శంషాబాద్ విమానాశ్రయంలో వాహనాల పార్కింగ్ ఛార్జీలు అధికం అనుకుంటే... అంతకుమించి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో వసూలు చేస్తున్నారు. ఎయిర్పోర్టులో వాలెట్ పార్కింగ్ సదుపాయం ఉంది. లాంజ్లో కారు దిగి వాలెట్ డ్రైవర్కు వాహనం ఇస్తే పార్క్ చేసి కావాలనుకున్నప్పుడు తీసుకొచ్చి ఇస్తాడు. ఈ తరహా సేవలతో కలిపి ఇక్కడ రెండు గంటల వరకు రూ.500 తీసుకుంటారు. రైల్వేస్టేషన్ టెర్మినల్-2లో 1.24 గంటలకే రూ.500 ఛార్జ్ చేస్తున్నారు. రైల్వే టికెట్కంటే పార్కింగ్ రుసుములే భయపెడుతున్నాయి. ఈ అంశం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ