
దిల్లీ 19 జనవరి (హి.స.): వైకాపా ఎంపీ మిథున్రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు ఇచ్చింది. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఈనెల 23న విచారణకు రావాలని పేర్కొంది. ఇప్పటికే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 22న విచారణకు రావాలని ఆయనకు సూచించింది.
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ