
అనంతపురం, 07 జనవరి (హి.స.)రాప్తాడుపేరూరు ప్రాజెక్టు కాలువ పనులను ఈ నెలలోనే ప్రారంభిస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత )అన్నారు. గంగులకుంటలో మంగళవారం పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీకి ఆమె హాజరయ్యారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రూ.13.05 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదిని ప్రారంభించారు. విద్యార్థులకు నోటుపుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో పట్టాదారు పాసుపుస్తకాలు, హద్దురాళ్లపై జగన్ తన బొమ్మ వేసుకునేందుకు చూపిన శ్రద్ధ భూసమస్యల పరిష్కారంపై చూపలేదని విమర్శించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ