
ములుగు, 08 జనవరి (హి.స.)
యువత తమ క్రీడా ప్రతిభను కనబరచడానికి సీఎం కప్ పోటీలు సువర్ణ అవకాశమని ఈ పోటీలను యువత సద్వినియోగం చేసుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. గురువారం కలెక్టరేట్ లో సీఎం కప్ రెండవ ఎడిషన్ టార్చ్ ర్యాలీ ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ స్థాయి క్రీడాకారులలో ఉన్న ప్రతిభను వెలికి తీయడం కోసం సీఎం కప్ వేదిక అని, ఈ అవకాశాన్ని గ్రామీణ స్థాయి యువత విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. క్రీడాపోటీలకు సంబంధించిన అవగాహన కల్పించడానికి అన్ని మండల కేంద్రాలలో టార్చ్ ర్యాలీ కొనసాగుతుందని వివరించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు