
హైదరాబాద్, 09 జనవరి (హి.స.) సంక్రాంతి పండగ వేళ భాగ్యనగర
వాసులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) తీపి కబురు చెప్పింది. దీర్ఘకాలంగా ఆస్తి పన్ను బకాయిలు ఉన్న వారి కోసం 'వన్ టైమ్ సెటిల్మెంట్' (OTS) పథకాన్ని 2025-26 ఆర్థిక సంవత్సరానికి కూడా కొనసాగిస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ పథకం ద్వారా పాత బకాయిలపై పేరుకుపోయిన వడ్డీలో ఏకంగా 90 శాతం రాయితీ కల్పించాలని నిర్ణయించింది.
ఈ మేరకు పన్ను చెల్లింపుదారులు ఆన్లైన్లో GHMC అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా లేదా తమకు దగ్గరలోని మీ-సేవ కేంద్రాలు, సిటిజన్ సర్వీస్ సెంటర్లలో బకాయిలు చెల్లించవచ్చని జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు