
హైదరాబాద్, 07 జనవరి (హి.స.)
హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి మత్తు పదార్థాల కలకలం చోటుచేసుకుంది. అక్రమంగా తరలిస్తున్న హైడ్రోపోనిక్ గంజాయిని కస్టమ్స్ అధికారులు బుధవారం ఉదయం పట్టుకున్నారు. ఫుకెట్ దేశం నుంచి శంషాబాద్కు వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఈ గంజాయిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
విమానంలోని సీటు నంబర్లు 16, 17 వద్ద హైడ్రోపోనిక్ గంజాయిని వదిలివెళ్లినట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. విదేశాల్లో మట్టి లేకుండా సాగు చేసే ఈ ప్రత్యేక రకం గంజాయి సుమారు ఒక కిలో వరకు ఉన్నట్లు సమాచారం. పట్టుబడిన గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..