
వరంగల్, 07 జనవరి (హి.స.)
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వరంగల్ ఆర్టీసీ రీజియన్ అధికారులు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొమ్మిది డిపోల నుంచి వివిధ రూట్లలో జాతర కోసం 4 వేల బస్సులను నడిపేందుకు ఏర్పాట్లను చేస్తూన్నారు. ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి బస్సులను జాతర కోసం నడిపించనున్నారు. ఈ మేరకు కండక్టర్లు, డ్రైవర్లతో పాటు ఇతర సిబ్బందిని సమకూర్చుకుంటున్నారు. జాతరకు లక్షలాది మంది తరలిరానుండటంతో ఎలాంటి తలెత్తకుండా పూర్తిస్థాయిలో కల్పించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు