
హైదరాబాద్, 07 జనవరి (హి.స.)
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ
మంత్రి కేటీఆర్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇవాళ సీఎల్పీ మీడియా సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శానసభలో సీఎం రేవంత్ రెడ్డిని ఎదుర్కొనే ధైర్యం లేక కేటీఆర్ బయట రోడ్ల వెంట తిరుగుతూ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. బట్టలూడదీస్తాం, తోలు తీస్తాం అని తొడలు కొట్టి సవాల్ చేసిన తండ్రీకొడుకులు.. తీరా అసెంబ్లీ సమయానికి ఎందుకు డుమ్మా కొట్టారో చెప్పలన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..