
అమారాతి, 01 ఏప్రిల్ (హి.స.)
నిత్యావసర వస్తువుల ధరల భారంతో సతమతమవుతున్న సామాన్యుడిపై మరో పిడుగు పడింది. ఏపీ(Ap)లో ప్రముఖ డెయిరీ సంస్థ విజయ పాలధరలను పెంచింది. లీటర్ పాలపై రూ. 2 చొప్పున పెంచుతున్నట్లు కృష్ణా మిల్క్ యూనియన్ ప్రకటించింది. పాల సేకరణ ఖర్చులు, ప్యాకేజింగ్ మెటీరియల్ ధరలు, రవాణా భారం పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని డెయిరీ వర్గాలు తెలిపాయి. పెరిగిన ఈ ధరలు తక్షణమే అమలులోకి రానున్నాయని పేర్కొన్నాయి.
అయితే ఈ నిర్ణయంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్పై అదనంగా భారం పడనుంది.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV