
కడప, 10 ఏప్రిల్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో పెను ప్రమాదం చోటు చేసుకుంది. నిలిపి ఉంచిన మూడు ప్రైవేట్ స్కూల్ బస్సులు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ సంఘటన కడప జిల్లా సిద్ధవటం మండలం కోగటం గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కడప జిల్లాలోని కోగటం గ్రామంలో నిలిపి ఉంచిన మూడు ప్రైవేట్ బస్సులు ఒక్కసారిగా అగ్నికి ఆహుతం అయ్యాయి. ఇక ఈ సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగింది.
ఆ తర్వాత అంటుకున్న మంటలను అదుపులోకి తీసుకువచ్చారు అగ్నిమాపక అధికారులు. అయితే ఈ సంఘటనలో మూడు బస్సులు కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. నిలిపి ఉంచిన బస్సులు కావడంతో ప్రాణాపాయం జరగలేదు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV