సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ వద్ద జాతీయ రహదారి పై లారీ. నీ.ట్రావెల్స్ బస్ డీ కొట్టింది
బస్సు ప్రమాదం 16మందికి గాయాలు
సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ వద్ద జాతీయ రహదారి పై  లారీ. నీ.ట్రావెల్స్ బస్ డీ కొట్టింది


కోదాడ , 11 ఏప్రిల్ (హి.స.)

ఇటీవల బస్ ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. ఎందరో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రైవేట్ బస్సు లు ఎక్కాలంటేనే జనం భయపడిపోతున్నారు.

సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ వద్ద జాతీయ రహదారిపై లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 16 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ నిద్ర మత్తులోనే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు అంటున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande