జీవన్ రెడ్డి తన నిర్ణయంపై పునరాలోచించుకోవాలి
జీవన్ రెడ్డి తన నిర్ణయంపై పునరాలోచించుకోవాలి అని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు
జీవన్ రెడ్డి తన నిర్ణయంపై పునరాలోచించుకోవాలి


హైదరాబాద్, 12 ఏప్రిల్ (హి.స.)

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరాలని తీసుకున్న నిర్ణయంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు. దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ జెండా మోసిన ఆయన, కేవలం స్థానికంగా ఉన్న చిన్నపాటి విభేదాల కారణంగా పార్టీని వీడటం సరైన నిర్ణయం కాదని హితవు పలికారు. దశాబ్దాల పాటు కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతిపై అలుపెరగని పోరాటం చేసిన జీవన్ రెడ్డి, ఇప్పుడు అదే కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోవడానికి సిద్ధపడటం చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి చర్యలు ఆయన రాజకీయ స్థాయికి తగవని, నవ్వుల పాలు కావద్దని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande