
శ్రీశైలం, 12 ఏప్రిల్ (హి.స.)
శ్రీశైలం వెళ్లే భక్తులకు తీపికబురు. శ్రీశైలంకు తరచూ వేలాదిమంది భక్తులు వెళ్తుంటారు. ఇక మహాశివరాత్రి సమయంలో అయితే ఆలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది. అయితే భక్తుల రద్దీ కారణంగా శ్రీశైలం వెళ్లే ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ సమస్య ఉంటుంది. కొన్నిసార్లు వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోతున్నాయి. దీంతో వాహనాల రద్దీ, ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ముందడుగు వేశారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే సిద్దమయ్యాయి. అటవీ ప్రాంతంలోని వన్యప్రాణులకు ఇబ్బంది లేకుండా ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్దమయ్యాయి. ఇది పూర్తయితే శ్రీశైలం వెళ్లే భక్తులకు సౌకర్యవతంగా ఉంటుంది. ఎలాంటి వాహనాల రద్దీ, ట్రాఫిక్ సమస్య ఉండదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi