
తాండూర్ : , 12 ఏప్రిల్ (హి.స.)
ఆటో కార్మికుల ( Auto Drivers ) సమస్యలను పరిష్కరిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని బీఆర్టీయూ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ఎండీ హబీబ్ పాషా ( MD Habib Pasha ) ఆరోపించారు. తాండూర్ మండల కేంద్రం ఐబీలో మండల ఆటో యూనియన్ సహకారంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా ఐదు లక్షల రూపాయల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందనఇ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం (ఫ్రీ బస్సు) వల్ల ఆర్ధిక ఇబ్బందులతో ఇప్పటివరకు 120 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. చనిపోయిన ఆటో డ్రైవర్ల కుటుంబాలకు రూ. 25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi