
ఢిల్లీ, 02 ఏప్రిల్ (హి.స.)ఢిల్లీకి చేరుకున్న ఏపీ మంత్రి నారా లోకేశ్కు టీడీపీ ఎంపీలు ఘన స్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీకు చెందిన ఎంపీలు ఆయనను ఆహ్వానించగా, లోక్సభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా మంత్రి లోకేశ్ వారిని అభినందించారు. ఈ సందర్భంగా అమరావతి అభివృద్ధి దిశగా ఇది కీలక ముందడుగు అని ఆయన పేర్కొన్నారు.
నిన్న లోక్ సభలో బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో ఉండవల్లిలోని తన నివాసం నుంచి టీవీలో ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తూ హర్షం వ్యక్తం చేసిన మంత్రి లోకేశ్.. ఈ రోజు రాజ్యసభలో చర్చను గ్యాలరీ నుంచి వీక్షించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV