
అమరావతి, 28 ఏప్రిల్ (హి.స.)
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి పి.రంజిత్ బాషా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. తొలుత ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సోమవారంతో ఫీజు చెల్లించే గడువు ముగిసింది. ఎక్కువ మంది విద్యార్థులకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఆ గడువును 30వ తేదీ వరకు పొడిగించారు. 30 తర్వాత ఎట్టిపరిస్థితుల్లోనూ గడువు పొడిగింపు ఉండదని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ