అమరావతిలో 114 సంస్థలకు భూముల కేటాయింపు
అమరావతిలో 114 సంస్థలకు భూముల కేటాయింపు
అమరావతిలో 114 సంస్థలకు భూముల కేటాయింపు


అమరావతి, 30 మే (హి.స.)

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భూ కేటాయింపులు, నిర్మాణ పనుల పురోగతిపై మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి. నారాయణ కీలక వివరాలను వెల్లడించారు. రాజధానిలో భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

మంత్రి నారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. అమరావతిలో ఇప్పటివరకు మొత్తం 114 సంస్థలకు 1,269 ఎకరాల భూమిని కేటాయించారు. ఇందులో 70 ప్రభుత్వ సంస్థలు, 44 ప్రైవేటు సంస్థలు ఉన్నాయి. అయితే, ఈ మొత్తం 114 సంస్థల్లో 3 సంస్థలు కొన్ని కారణాల వల్ల తమ కేటాయింపులను రద్దు చేసుకోగా.. మరో 3 సంస్థలకు గతంలో కేటాయించిన స్థలానికి బదులుగా వేరే చోట భూమిని కేటాయించినట్లు మంత్రి వివరించారు.

అమరావతిలో స్టూడియోలు లేదా ఇతర సంస్థల స్థాపన కోసం తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రతిపాదనలు రాలేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అయితే, ముంబైకి చెందిన కొన్ని ప్రముఖ సినీ, వ్యాపార సంస్థలు అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు, భూముల కోసం ముందుకు వచ్చాయని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande