
హైదరాబాద్, 21 జూన్ (హి.స.)
సంజీవరెడ్డినగర్, : ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రకాల రుగ్మతల నుంచి రక్షణ పొందాలంటే యోగా తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకు బల్కంపేటలోని కొణిజేటి రోశయ్య ప్రభుత్వ ప్రకృతి చికిత్సాలయం ప్రాంగణంలో ఉన్న వేమన యోగా పరిశోధన సంస్థ ప్రధాన పాత్ర పోషిస్తోంది. తక్కువ ఫీజు కావడం, యోగా నిపుణుల పర్యవేక్షణలో ఆసనాలు వేయడం ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడ యోగా నేర్చుకున్న కొందరు యువతీ యువకులు దేశంలోని పలు ప్రాంతాల్లో యోగా గురువులుగా స్థిరపడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్