విస్తరించిన ఉపరితల ఆవర్తనం.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లండి: వాతావరణ శాఖ
కర్నూలు, 22 జూన్ (హి.స.)రాయలసీమ, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, అలాగే ఛత్తీస్గఢ్ నుండి తెలంగాణ వరకు ద్రోణి కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. వీటి ప్రభావంతో నేడు మేఘవృతమైన వాతావరణంతో పాటు చెదురుమదురుగా మోస్తరు న
heavy-rains-and-strong-winds-havoc-in-atmakur-1


కర్నూలు, 22 జూన్ (హి.స.)రాయలసీమ, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, అలాగే ఛత్తీస్గఢ్ నుండి తెలంగాణ వరకు ద్రోణి కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. వీటి ప్రభావంతో నేడు మేఘవృతమైన వాతావరణంతో పాటు చెదురుమదురుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే మిగతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని సూచించారు. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటిని గమనిస్తూ వీలైనంత దూరంగా ఉండాలన్నారు. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లో పనిచేసే రైతులు, శ్రామికులు, పశుకాపరులు మరింత అప్రమత్తంగా ఉండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande