ఉత్తరప్రదేశ్లో 35 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా 'మహా వృక్షారోపణ 2026' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం యోగి
ఉత్తరప్రదేశ్లో 35 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా 'మహా వృక్షారోపణ 2026' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం యోగి
Yogi Adithyanath


గోరఖ్‌పూర్ (ఉత్తరప్రదేశ్), 12 జూలై (హి.స.)

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం 'ఏక్ పేడ్ మా కే నామ్' (అమ్మ పేరిట ఒక మొక్క) ప్రచారంలో భాగంగా ఒక మొక్కను నాటారు. రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 35 కోట్ల మొక్కలను నాటడమే లక్ష్యంగా పెట్టుకున్న 'మహా వృక్షారోపణ 2026' భారీ పర్యావరణ ఉద్యమాన్ని ఆయన గోరఖ్‌పూర్ జిల్లా నుండి అధికారికంగా ప్రారంభించనున్నారు. రాబోయే గంటల్లో గోరఖ్‌పూర్‌లో జరగనున్న బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారని, రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణను పెంపొందించడానికి మరియు పచ్చదనాన్ని విస్తరించడానికి ఈ భారీ డ్రైవ్‌కు శ్రీకారం చుట్టనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) తెలిపింది. ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో భాగంగా ముఖ్యమంత్రి గోరఖ్‌పూర్‌లో 'పవిత్ర త్రివేణి ప్లాంటేషన్ అండ్ డెవలప్‌మెంట్ గార్డెన్'ను కూడా ఏర్పాటు చేయనున్నారు. పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడంలో భాగంగా స్థానిక రైతులకు 'కార్బన్ క్రెడిట్ స్కీమ్' కింద సీఎం సర్టిఫికేట్లను పంపిణీ చేయనున్నారు. ఈ పర్యావరణ బృహత్కార్యంలో ఉత్తరప్రదేశ్ ప్రజలందరూ భాగస్వాములు కావాలని, ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క మొక్కనైనా నాటి రాష్ట్రాన్ని హరితమయంగా మార్చాలని డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రారంభమైన ఈ 'ఏక్ పేడ్ మా కే నామ్' ప్రచారం, తల్లితో ఉన్న భావోద్వేగ బంధాన్ని పర్యావరణ బాధ్యతతో ముడిపెడుతూ ప్రజల్లో చైతన్యం తెస్తోందని అధికారులు పేర్కొన్నారు.

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande