63 కిలోమీటర్ల లక్నో-కాన్పూర్ ఎక్స్ప్రెస్వేను ప్రారంభించనున్న రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, సీఎం యోగి
63 కిలోమీటర్ల లక్నో-కాన్పూర్ ఎక్స్ప్రెస్వేను ప్రారంభించనున్న రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, సీఎం యోగి
rajnath


లక్నో (ఉత్తరప్రదేశ్), 13 జూలై (హి.స.)

ఉత్తరప్రదేశ్ మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు రోడ్డు కనెక్టివిటీలో ఒక ప్రధాన మైలురాయిగా నిలిచే 63 కిలోమీటర్ల లక్నో-కాన్పూర్ ఎక్స్‌ప్రెస్‌వేను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మరియు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంయుక్తంగా ప్రారంభించనున్నారు. దీనితో పాటు రూ. 4,850 కోట్లకు పైగా వ్యయంతో కూడిన మూడు జాతీయ రహదారి ప్రాజెక్టులకు కూడా వీరు ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపనలు చేయనున్నారు.

ఈ ప్రారంభోత్సవానికి ముందు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. లక్నో-కాన్పూర్ ఎక్స్‌ప్రెస్‌వే ఉత్తరప్రదేశ్ కనెక్టివిటీకి సరికొత్త దిశను చూపే ఒక చీరత్రాత్మక విజయం అని కొనియాడారు. మెరుగైన రోడ్ల వల్ల ప్రయాణ దూరం తగ్గడంతో పాటు అభివృద్ధి వేగం పుంజుకుంటుందని, కొత్త పెట్టుబడులకు తలుపులు తెరుచుకుంటాయని సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు ఉత్తరప్రదేశ్‌లో ఆధునిక మౌలిక సదుపాయాలు మరియు వేగవంతమైన ఆర్థిక పురోగతికి పునాది రాళ్లుగా మారుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

లక్నో లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఈ ఎక్స్‌ప్రెస్‌వే అందుబాటులోకి రావడం వల్ల లక్నో మరియు కాన్పూర్ మధ్య ప్రయాణ సమయం కేవలం 45 నుండి 50 నిమిషాలకు తగ్గిపోతుందని, ఇది ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా మారుతుందని తెలిపారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నిర్మించిన ఈ ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా లక్నో ఎయిర్‌పోర్ట్ మరియు షహీద్ పథ్‌లకు వేగవంతమైన కనెక్టివిటీ లభిస్తుంది. అంతేకాకుండా, ఝాన్సీ, ఆగ్రా మార్గాల ద్వారా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ వైపునకు.. అలాగే ప్రయాగ్‌రాజ్-వారణాసి కారిడార్ ద్వారా బీహార్, నేపాల్ వైపునకు రవాణా మరింత సులభతరం కానుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande