
విశాఖ, 15 జూలై (హి.స.)
విశాఖ ఆర్కే బీచ్లో పర్యాటకులకు పెను ప్రమాదం తప్పింది. నల్గొండ జిల్లా ముషంపల్లికి చెందిన ఐదుగురు ఆర్కే బీచ్కు వచ్చారు. వారంతా ఉత్సాహంగా సముద్రంలో ఈత కొడుతుండగా.. ఒక్కసారిగా అలలు ఎగసిపడ్డాయి. అలల ఉద్ధృతికి ఐదుగురు సముద్రంలోకి కొట్టుకుపోయారు. గమనించిన లైఫ్గార్డ్ ధనరాజ్ వెంటనే సముద్రంలోని దిగి మునిగిపోతున్న వారిని రక్షించారు. అక్కడే ఉన్న పోలీసులు వారికి సహకరించి ఒడ్డుకు చేర్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ