
నెల్లూరు, 16 జూలై (హి.స.) నెల్లూరు నగర కార్పోరేషన్ ను స్వచ్ఛతలో ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా అత్యంత ప్రతిష్టాత్మకంగా 200 ఎలక్ట్రికల్ ఆటోలను సమకూర్చినట్లు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఈ రోజు ఉదయం ప్రకటించారు. సుప్రీంకోర్టు, ఎన్జీటీ నిబంధనల ప్రకారం తడి-పొడి చెత్తను శాస్త్రీయంగా వేరు చేసి తరలించేందుకు ప్రవేశపెట్టిన ఈ వాహనాలలో మొదటి విడత కింద 100 ఎలక్ట్రికల్ ఆటోలను,ఈ శనివారం ఉదయం 11 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ వర్చువల్ విధానంలో ఘనంగా ప్రారంభించనున్నారని వెల్లడించారు.
ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి నెల్లూరు నగరం సర్వసిద్ధమైందని, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ మరియు ఇతర ఉన్నతాధికారులతో కలిసి స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించామని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV