
అమరావతి, 17 జూలై (హి.స.)
: రాజధాని సీడ్ యాక్సిస్ రోడ్డును పాత గుంటూరు హైవేకి అనుసంధానించే పనులను మున్సిపల్శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. సీడ్ యాక్సిస్ రోడ్డులో భాగంగా ప్రభుత్వం రెండు స్టీల్ బ్రిడ్జిలు నిర్మిస్తోంది. బకింగ్ హామ్ కెనాల్, కొండవీటి వాగులపై స్టీల్ బ్రిడ్జిల నిర్మాణం దాదాపు పూర్తి కావొస్తోందని తెలిపారు. విజయవాడ, మంగళగిరి నుంచి నేరుగా అమరావతిలోకి ప్రవేశించేలా సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తున్నట్టు వెల్లడించారు. స్టీల్ బ్రిడ్జి పనులు పూర్తయ్యేలోపు రహదారి పెండింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ