
నార్కట్పల్లి, 26 జూలై (హి.స.)
నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామివారి గుట్ట కింద శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒకేసారి భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంలో గుట్ట కింద ఉన్న దాదాపు 17 బొమ్మల దుకాణాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో తృటిలో పెద్ద ప్రాణనష్టం తప్పింది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. బాధితులు తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi