ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
pension


అమరావతి, 30 జూలై (హి.స.)

ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవి కుమార్ ఆదేశాల మేరకు గురువారం ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆమదాలవలస మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్ తమ్మినేని గీతాసాగర్ , స్టేట్ లీగల్ కార్యదర్శి, 13వ వార్డు ఇన్ఛార్జ్ తమ్మినేని విద్యాసాగర్ ఇంటింటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు. అదేవిధంగా మెట్టక్కివలసలోనూ పింఛన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తమ్మినేని రవితోపాటు తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande