
సత్యసాయి జిల్లా, 01 ఆగస్టు (హి.స.) సత్యసాయి జిల్లా నల్లచెరువులో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఇంటింటికీ తిరుగుతూ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసి సంక్షేమంపై అవగాహన కల్పించారు.
నల్లచెరువులో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సత్యసాయి జిల్లా నల్లచెరువు మండల కేంద్రంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఎన్టీఆర్ సామాజిక పెన్షన్లను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే వీధి వీధిన తిరుగుతూ డోర్ టు డోర్ ఇండ్ల వద్దకు వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా తానే పెన్షన్లు పంపిణీ చేస్తూ కూటమి ప్రభుత్వ అభివృద్ధి పాలనపై అవగాహన కల్పించారు.అలాగే ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు గురించి అడిగి తెలుసుకున్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV