
కోనసీమ, 17 ఆగస్టు (హి.స.)
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించినఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. తమ వారి ఆచూకీ కోసం అల్లవరం మెరైన్ పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈనెల 3వ తేదీన ఓడలరేవు తీరం నుంచి విశాఖపట్నం చేపల వేటకు మత్స్యకారులు బయలుదేరారు. వేటకు వెళ్లిన గంట నుంచే బోటు నుంచి సిగ్నల్స్ నిలిచిపోయాయి. పది రోజుల్లో తిరిగి రావాల్సిన మత్స్యకారులు ఇంతవరకూ తిరిగి రాక పోవడంతో కుటుంబ సభ్యుల ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై మెరైన్ పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు అధికారులు సముద్రంలో ము
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ