
హైదరాబాద్, 17 ఆగస్టు (హి.స.)
ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలోనే వేగంగా పరిష్కరించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేటి నుండి (ఆగస్టు 17) మండల కేంద్రాలలో కూడా 'ప్రజావాణి' కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో జరిగే ప్రజావాణి తరహాలోనే, ఇకపై ప్రతి సోమవారం ఉదయం 10:00 గంటలకు అన్ని మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయాల్లో (MPDO) ఈ కార్యక్రమం నిరంతరాయంగా నిర్వహించబడుతుంది. స్థానిక ఎంపేడీఓ ఈ కార్యక్రమానికి నోడల్ ఆఫీసర్గా వ్యవహరిస్తూ ప్రజల నుండి వివిధ సమస్యలపై దరఖాస్తులను మరియు వినతి పత్రాలను స్వీకరిస్తారు. గ్రామీణ ప్రాంత ప్రజలు చిన్న చిన్న సమస్యల కోసం జిల్లా కేంద్రాలకు లేదా హైదరాబాద్కు రావలసిన అవసరం లేకుండా, మండల స్థాయిలోనే తక్షణ పరిష్కారం చూపేందుకు ఈ సంస్కరణ ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi