పద్మావతీ అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు.. వివరాలు ఇవే..!
పద్మావతీ అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు.. వివరాలు ఇవే..!
తిరుచానూరు


తిరుచానూరు, 02 ఆగస్టు (హి.స.) తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయం, అనుబంధ ఆలయాలలో ఆగస్టు నెలలో పలు విశేష ఉత్సవాలు నిర్వహించనున్నట్లు అధికారులు పత్రికా ప్రకటన ద్వార తెలిపారు.

శుక్రవారం సందర్భంగా ఈ నెల 7, 14, 28వ తేదీల్లో సాయంత్రం 6 గంటలకు తిరుచ్చిపై అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించున్నారని వెల్లడించారు. ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా 25న శ్రీపద్మావతి అమ్మవారు సాయంత్రం 6.45 గంటలకు గజ వాహనంపై భక్తులను కటాక్షిస్తారని పేర్కొన్నారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా 21న సాయంత్రం 6 గంటలకు శ్రీపద్మావతి అమ్మవారి స్వర్ణరథోత్సవం జరగనుందని వెల్లడించారు.

బలరామ కృష్ణ స్వామి వారి ఆలయంలో..రోహిణి నక్షత్రం సందర్బంగా 8న శ్రీ కృష్ణ స్వామివారికి సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి ఉత్సవం.

సుందరరాజ స్వామి ఆలయంలో..ఉత్తర భద్ర నక్షత్రం సందర్భంగా 3, 30వ తేదీలల్లో సాయంత్రం 6 గంటలకు స్వామివారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధులలో విహరింపు.

సూర్యనారాయణ స్వామి ఆలయంలో... హస్త నక్షత్రం సందర్భంగా 17న సాయంత్రం 5 గంటలకు స్వామివారు తిరుచ్చిపై భక్తులకు కటాక్షం.

తిరుచానూరు శ్రీనివాస ఆలయంలో..8, 15, 22, 29వ తేదీలలో వేంకటేశ్వరస్వామివారి మూలవర్లకు అభిషేకం.

అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో..4న ఉదయం 8 గంటలకు అష్టదళ పాదపద్మారాధన సేవ.

శుక్రవారం సందర్భంగా 7, 14, 21, 28వ తేదీలలో ఉదయం 7 గంటలకు వస్త్రలంకారణ సేవ, అభిషేకం. 12న ఉదయం 8 గంటలకు అష్టోత్తరశత కలశాభిషేకం.

26న శ్రీదేవి, భూదేవి సమేత ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి కల్యాణోత్సవం. 2, 9, 16, 23, 30వ తేదీలలో ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి ఉదయం 8.15 గంటలకు అభిషేకం.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande