కరువు నివారణకు డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఉద్యాన పంటల ప్రోత్సాహం
కరువు నివారణకు డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఉద్యాన పంటల ప్రోత్సాహం
farmer


అనంతపురం:, 26 ఆగస్టు (హి.స.)

అనంతపురం జిల్లాలోని వర్షాభావ ప్రాంతాల్లో ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖ బృహత్తర ప్రణాళికను అమలు చేస్తోంది. వేరుశనగ స్థానంలో బిందు సేద్యం (డ్రిప్ ఇరిగేషన్) ద్వారా మామిడి, బొప్పాయి, దానిమ్మ పంటలను సాగు చేసే రైతులకు 90 శాతం రాయితీపై పరికరాలను అందిస్తున్నారు. నీటి కొరత ఎక్కువగా ఉన్నందున భూగర్భ జలాలను పొదుపుగా వాడుకుంటూ ఎక్కువ దిగుబడి సాధించే సాంకేతికతపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ పథకం ద్వారా కరువు పీడిత ప్రాంతాల రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం లభిస్తుందని అధికారులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande