తుంగభద్ర నదికి పెరిగిన ఇన్ ఫ్లో, పశ్చిమ ప్రాంతంలో అలర్ట్
తుంగభద్ర నదికి పెరిగిన ఇన్ ఫ్లో, పశ్చిమ ప్రాంతంలో అలర్ట్
తుంగభద్ర నదికి పెరిగిన ఇన్ ఫ్లో, పశ్చిమ ప్రాంతంలో అలర్ట్


కర్నూలు: , 26 ఆగస్టు (హి.స.)

ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కర్నూలు జిల్లాలోని తుంగభద్ర జలాశయానికి వరద నీటి తాకిడి భారీగా పెరిగింది. డ్యామ్ నిండుకుండలా మారడంతో అధికారులు అదనపు నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో తుంగభద్ర నదీ పరివాహక ప్రాంత ప్రజలను జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని, నదిలోకి దిగడం లేదా ఈత కొట్టడం లాంటివి చేయకూడదని హెచ్చరికలు జారీ చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి రెవెన్యూ మరియు పోలీసు అధికారులను విధుల్లో ఉంచారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande