
అమరావతి, 03 ఆగస్టు (హి.స.).అన్ని శాఖల్లో డేటా
ఆధారిత పాలనకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆర్టీజీఎస్లో డేటా ఆధారిత నిర్ణయాలపై సీఎం చంద్రబాబు ఈరోజు (సోమవారం) సమీక్ష సమావేశం నిర్వహించారు. పై అధికారులకు సీఎం మార్గనిర్దేశం చేశారు. సీఎం సమీక్షకు ఏపీ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, ఐటీ, ఆర్టీజీఎస్, వ్యవసాయం, మున్సిపల్, సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
రియల్ టైమ్ గవర్నెన్స్ వ్యవస్థ పనితీరుపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఆర్టీజీ ద్వారా పాలన మరింత సమర్థవంతంగా, సులభంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రభుత్వ నిర్ణయాలతో డేటా వినియోగాన్ని పెంచాలని ఆదేశించారు. ఆయా శాఖల వారీగా డేటా సమన్వయంపై అధికారులతో సీఎం చంద్రబాబు చర్చించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ