
హైదరాబాద్, 07 ఆగస్టు (హి.స.)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ రోజు ఉదయం అమరావతి రాజధాని ప్రాంతంలో జరుగుతున్న వివిధ మౌలిక వసతుల నిర్మాణ పనులపై ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో సీఆర్డీఏ అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులు పాల్గొన్నారు. రాబోయే ఆరు నెలల్లో పూర్తి చేయాల్సిన ప్రాధాన్యత కలిగిన రోడ్లు, ప్రభుత్వ భవనాల నిర్మాణ పురోగతిని సీఎం స్వయంగా అడిగి తెలుసుకున్నారు.నిర్మాణ పనుల్లో ఎలాంటి నాణ్యతా లోపాలు లేకుండా, నిర్ణీత గడువులోగా పూర్తి చేయడానికి అవసరమైన అదనపు నిధులను తక్షణమే విడుదల చేయాలని ఆర్థిక శాఖను సీఎం ఆదేశించారు. రాజధాని పరిధిలోని ఐటీ హబ్ మరియు ల్యాండ్ పూలింగ్ రైతులకు సంబంధించిన లేఅవుట్ల అభివృద్ధి పనులను ఈ ఉదయం నుంచే వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ అయ్యాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi