ఇడుపులపాయ.ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం లోకేష్ ఆగ్రహం
10 జూలై (హి.స.) అమరావతి: ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో గంజాయి కలకలంపై మంత్రి లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. ట్రిపుల్‌ ఐటీలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం ఆయన్ను కలిశారు
ఇడుపులపాయ.ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం లోకేష్ ఆగ్రహం


10 జూలై (హి.స.)

అమరావతి: ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో గంజాయి కలకలంపై మంత్రి లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. ట్రిపుల్‌ ఐటీలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం ఆయన్ను కలిశారు. తమ పిల్లల్ని అక్కడ చేర్పించి నష్టపోతున్నామంటూ వాపోయారు. క్యాంపస్‌ మొత్తం గంజాయికి అడ్డాగా మారిందని ఫిర్యాదు చేశారు.

దీనిపై స్పందించిన లోకేశ్‌.. సమస్యను పరిష్కరించి విద్యార్థుల భవిష్యత్తు కాపాడతానని హామీ ఇచ్చారు. గంజాయిని ప్రోత్సహించే స్థానిక రాజకీయ నాయకులపైనా కఠిన చర్యలకు ఆదేశించారు. విద్యాలయాల్లో వాటి ఆనవాళ్లు లేకుండా నిర్మూలిస్తామని తల్లిదండ్రులకు ఆయన హామీ ఇచ్చారు. ఇప్పటికే ప్రభుత్వం ఆ దిశగా కఠిన చర్యలు చేపట్టిందని లోకేశ్‌ వివరించారు.

ముగింపు

హిందూస్తాన్ సమచార్ / నిత్తల / నాగరాజ్ రావు


 rajesh pande