
అమరావతి, 19 డిసెంబర్ (హి.స.)
:ఆంధ్రప్రదేశ్లోని మున్సిపాలిటీలకు ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు)లను కూటమి సర్కార్) ప్రకటించింది. తిరుపతి మున్సిపాలిటీకి గోల్డ్ అవార్డు, భీమవరం మున్సిపాలిటీ)కి సిల్వర్ అవార్డులు దక్కాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 123 మున్సిపాలిటీలకు ఈ అవార్డులు ప్రకటించగా.. తిరుపతి మెుదటిస్థానం, భీమవరం మున్సిపాలిటీ రెండో స్థానం సొంతం చేసుకున్నాయి. మున్సిపల్ కార్పొరేషన్లో విద్యుత్ వినియోగం, ఆదా చేయడంలో కృషి చేసిన మున్సిపాలిటీలకు ఈ అవార్డులు లభించాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ