హైదరాబాద్, 18 అక్టోబర్ (హి.స.)
ట్రాన్స్కో ఏఈ రూ.30 వేలు లంచం
తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ సంఘటన శనివారం సాయంత్రం జరిగింది. గండిపేట మండల పరిధిలోని బండ్లగూడ మున్సిపల్ పరిధిలోని పీరం చెరువులో ఉన్న హిమాయత్ సాగర్ విద్యుత్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈ రాకేష్ రూ. 30,000 తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..