సంగారెడ్డి, 18 అక్టోబర్ (హి.స.)
రాష్ట్ర వ్యాప్తంగా బీసీ మద్దతుగా
శనివారం బందుకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బంద్ ఎఫెక్ట్ కారణంగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో సంగారెడ్డి డిపోలో డ్రైవర్లు, కండక్టర్లు ఉదయం యోగా చేశారు. ఆర్టీసీ ఉద్యోగులంతా సంగారెడ్డి డిపోలో యోగా మాస్టర్ నామ్ నాథ్ ఆధ్వర్యంలో యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ ఉపేందర్ మాట్లాడుతూ.. డ్రైవర్లు, కండక్టర్లకు యోగాపై కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని అవగాహన ఏర్పాటు చేశామన్నారు. నిత్యం ప్రయాణికులను చేరవేస్తూ తీరిక లేకుండా ఉండే ఆర్టీసీ ఉద్యోగులకు ఈ యోగా చేయడంతో కొంత శరీరానికి రిలీఫ్ కలిగినట్లు అయిందని ఉద్యోగులు చెబుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు