హైదరాబాద్, 19 అక్టోబర్ (హి.స.)
ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలను అరికట్టడానికి హైదరాబాదు నగర ట్రాఫిక్ పోలీస్ విభాగం కట్టుదిట్టమైన చర్యలు
చేపడుతోంది. ఈ నేపథ్యంలో, తేదీ 18-08-2025 న అబిడ్స్, చిక్కడపల్లి, సైఫాబాద్ మరియు గాంధీనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పట్టుబడిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల విచారణ గౌరవనీయ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు, నాంపల్లి, హైదరాబాద్లో జరిగింది.
ఈ విచారణలో మొత్తం (212) మంది నిందితులు హాజరయ్యారు. వీరిలో —
(187) మందికి ఒక్కొక్కరికి రూ. 3,100/- చొప్పున జరిమానా విధించబడింది.
(25) మందికి కోర్టు జైలుశిక్షతో పాటు రూ. 99,900/- మొత్తంలో జరిమానా విధించింది.
మొత్తం రూ. 6,79,600/- జరిమానా కోర్టు ద్వారా విధించబడింది.
అలాగే, సెల్ ఫోన్ డ్రైవింగ్ కేసులలో (147) మంది నిందితులు హాజరయ్యారు. వీరిలో ప్రతి ఒక్కరికి రూ. 1,100/- చొప్పున జరిమానా విధించబడగా, మొత్తం రూ. 1,61,700/- జరిమానా విధించబడింది.
మైనర్ డ్రైవింగ్ కేసులలో కూడా (7) మంది నిందితులు హాజరై, ప్రతి ఒక్కరికి రూ. 2,100/- చొప్పున జరిమానా విధించబడింది. మొత్తం రూ. 14,700/- జరిమానాగా కోర్టు ద్వారా విధించబడింది.
ఈ చర్యలు ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం వల్ల సంభవించే ప్రమాదాలను తగ్గించడం మరియు ప్రజల్లో ట్రాఫిక్ భద్రతపై అవగాహన పెంపొందించడం లక్ష్యంగా చేపట్టబడ్డాయి.
ACP.Traffic. Central zone
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు