అమరావతి, 22 అక్టోబర్ (హి.స.)
: అల్లూరి సీతారామరాజు జిల్లాలో వాహనం బీభత్సం సృష్టించింది. జీకే వీధి మండలం రింతాడ వద్ద రోడ్డుపక్కన కూరగాయలు విక్రయిస్తున్న గిరిజనులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ